టాలీవుడ్ లో హీరోయిన్ పూజ హెగ్డే బుట్ట బొమ్మగా మరింత క్రేజ్ అందుకుంది.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్ పైన ఆశపడి అక్కడ వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే రెండు సినీ ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేయలేక బ్యాలెన్స్ తప్పినట్టుగా కనిపిస్తోంది. దీంతో రెండు వైపులా ఈమె సినీ కెరియర్ నాశనం అయ్యింది. మహేష్ తో నటించే గుంటూరు కారం సినిమాలో అవకాశం వచ్చినందుకు వదులుకున్నట్లు తెలుస్తోంది.


ఈ  అమ్మడు ఇందులో మెయిన్ లీడ్ లో అయినప్పటికీ కూడా బాలీవుడ్ సినిమాల పైన మోజుతో డేట్లు ఇవ్వలేకపోయినట్లు సమాచారం.. టాలీవుడ్లో మహేష్ తో సినిమా వదులుకోవడంతో ఇప్పుడు ఈమె గురించి పది రకాల చర్చలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు కూడా లేవని ఇటీవలే మళ్లీ తెలుగులో సినిమాల పైన దృష్టి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  మూడు సినిమాలకు సంబంధించి ఇక్కడ దర్శక నిర్మాతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. కొత్త ఏడాది ఆ ప్రాజెక్టులతో ఒకేసారి సంతకం చేయబోతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పూజా హెగ్డే తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా కనిపిస్తోందని ఆమె సన్నిహితులు వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగు సినీ పరిశ్రమ నుంచి సినిమాలు వదులుకోవడం వల్ల ఆమెలో పశ్చాత్తాపం కనిపిస్తోందని సమాచారం.. బాలీవుడ్ కు వెళ్లి చాలా తప్పు చేశానని తన సన్నిహితులతో చెప్పి ఫీల్ అయినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పూజా హెగ్డే కం బ్యాక్ అనేది తెలివైన నిర్ణయం అని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. మరి రీ  ఎంట్రీ లో అయినా పూజా హెగ్డే ఏ విధంగా తన కెరీయర్ని ముందుకు తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తుందో చూడాలి మరి. వచ్చిన అవకాశాన్నల్లా వినియోగించుకొని సక్సెస్ బాటపడుతుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: