చాలా మంది సినీ సెలబ్రెటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలా మంది సెలబ్రెటీలకు రూహి యోగా నేర్పించారు. దాంతో ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులయ్యారు. వారిలో ఛార్మి ఒకరు. ఇక ఇప్పుడు రూహి మరణ వార్త విని ఛార్మి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు." నీ గురించి ఇలా నేను పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. మై డియర్ రూహి.. నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను.. నాకు మాటలు కూడా రావడం లేదు.. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను.. మనం చివరగా కూడా ఎంతో సరదాగా, నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.. మనది 18 ఏళ్ల బంధం.. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి" అంటూ ఎమోషనల్ అయ్యారు ఛార్మి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి