![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle82343792-1fbc-4b5f-b3eb-fce23e0073b0-415x250.jpg)
నందమూరి బాలకృష్ణ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి చిత్రం మార్చి 2న రీరిలీజ్ కి సిద్ధమా అవుతోంది. సరిగ్గా ఇదే టైంలో ఒక రోజు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి చిత్రం కూడా రీరిలీజ్ అవుతోంది. ఇది యాదృచ్చికంగా జరిగిందా.. లేక వాంటెడ్ గానే ప్లాన్ చేసారా అనేది క్లారిటీ లేదు.సింహాద్రి చిత్రం కూడా తారక్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించాడు. ఎన్నికల వేడి నెలకొన్న ఈ సమయంలో బాలయ్య, తారక్ ఈ రకంగా పోటీ పడడం ఊహించని విషయమే.నందమూరి అభిమానులు ఆల్రెడీ బాలయ్య ఫ్యాన్స్ గా.. తారక్ ఫ్యాన్స్ గా డివైడ్ అయ్యారనే ప్రచారం ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరి చిత్రాలు రీ రిలీజ్ లో పోటీ పడడం ఫ్యాన్స్ మధ్య లేనిపోని గొడవలు సృష్టించడమే అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.