![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestylebbfa6f2c-5bec-43b9-9c46-ff28b6cad218-415x250.jpg)
ఆ థియేటర్స్ వద్ద వారి సందడి ఒక రేంజ్లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రస్తుతం దేవి, సుదర్శన్ 35MM, సంధ్య థియేటర్స్ ఉన్నాయి. సుదర్శన్ 70MM సింగిల్ స్క్రీన్ కూడా అక్కడ ఉండేది. 2010లో అనివార్య కారణాల వల్ల అది మూతపడింది.ఇప్పుడు దానిని మహేశ్ బాబు రీఓపెన్ చేస్తున్నారని టాక్. అందులో పేరుతో 7 స్క్రీన్స్ ఉండేలా మల్టీఫ్లెక్స్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశారని తెలుస్తోంది. క్లాసిక్ పేరుతో అక్కడ బిగ్ మల్టీఫ్లెక్స్ ప్రారంభం కాబోతుందని సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ముఖ్యంగా మహేశ్ బాబుకు ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ అందుకే గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా అక్కడ కొంత భాగం తీశారు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాను మొదటిరోజు ఫ్యాన్స్తో సహా ఆయన కుటుంబ సభ్యులు అక్కడే చూస్తారు. కాబట్టి సుదర్శన్ థియేటర్ ను తీసుకొని ఏఎంబీ థియేటర్ నీ మించి ఆ థియేటర్ ను కొత్తగా రూపొందించాలని చూస్తున్నారట మహేష్ బాబు.