జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు.బుల్లితెరపై కామెడీ షోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జబర్దస్త్ వచ్చిన తర్వాత అనేక కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ కమెడియన్లు చేస్తున్న కామెడీ కడుపుబ్బా నవ్విస్తోంది. అదే సమయంలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. వల్గారిటీ, డబుల్ మీనింగ్ కామెంట్స్, బాడీ షేమింగ్ ఎక్కువవుతోందనే విమర్శలు తరచుగా వింటూనే ఉన్నాం.జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. ఎన్ని విమర్శలు వచ్చినా రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న షోలకు ఆదరణ తగ్గడం లేదు. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మిని ముడిపెడుతూ కామెడీ స్కిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ బుల్లితెరపై దూరమైనప్పటికీ ఆ తరహా పంచ్ లు పడుతూనే ఉన్నాయి.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది.. రష్మీ కలసి కొన్ని వల్గర్ అనిపించే కామెంట్స్ చేశారు. లేటెస్ట్ గా హోలీ స్పెషల్ అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. రంగస్థలం మహేష్ పై కామెడీ పంచ్ లతో హైపర్ ఆది మొదలు పెట్టాడు.సలార్ చిత్రంలో రాజమన్నార్ పాత్రకి నన్ను అడిగారు తెలుసా అని మహేష్ అంటాడు. నువ్వు రాజమన్నార్ అన్నావు.. వాళ్ళు వెళ్లామన్నారు అంటగా అంటూ హైపర్ ఆది మహేష్ పరువు తీశాడు. ఆ తర్వాత రష్మీ, హైపర్ ఆది డబుల్ మీనింగ్ కామెడీ మొదలయింది.రష్మీ..హైపర్ ఆది ఎలాంటి వాడో గూగుల్ ని అడిగి తెలుసుకుందాం అని ప్రయత్నిస్తోంది. గూగుల్ తల్లిని హైపర్ ఆది ఎలాంటి వాడు అని అడుగుతుంది. నన్ను అందరూ గూగుల్ తల్లి అని అంటారు.. కానీ నన్ను తల్లిని చేసిందే వాడు అంటూ ఫోన్ లోనుంచి వాయిస్ వస్తుంది. దీనితో అంతా పగలబడి నవ్వేస్తారు. గూగుల్ తల్లినే తల్లిని చేశావా అని రష్మీ హైపర్ ఆదిని అడుగుతుంది.ఆ టైంలో నేను ఒకడితో తిరిగేవాడిని.. మీ వాడే వాడు.. వాడి వల్లే ఇదంతా అంటూ పరోక్షంగా హైపర్ ఆది సుడిగాలి సుధీర్ ని ఇరికించాడు. ఆ తర్వాత హైపర్ ఆది.. గూగుల్ తల్లిని ఇంద్రజ గురించి అడుగుతాడు. ఆమె ఇప్పుడే ఇలా ఉన్నారంటే.. ఆ వయసులో చించేసి ఉంటారు అని చెబుతుంది. హైపర్ ఆది వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: