చివరిగా డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఇప్పుడు 21వ సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా సెట్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథలో భాగంగా ఒక సిబిఐ ఆఫీస్ లో కొంత షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఆఫీస్ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటు ఈ సిబిఐ ఆఫీస్ సెట్ లో షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే 9 రోజుల షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఒక రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సెట్టు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. 9వ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అయితే ఈ విషయం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో సినిమా యూనిట్ దృష్టికి వచ్చిందని వెళ్లేలోపు దాదాపు మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ అగ్ని ప్రమాదం కారణంగా సినిమా యూనిట్ కి దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు నష్టం చేకూరినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ నెలలో పట్టాలెక్కింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. విజయశాంతి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచే ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను త్వరలో ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: