ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరే మారుమ్రోగిపోతుంది . దానికి కారణం విజయ్ దేవరకొండ చేసిన సంచలన కామెంట్స్.  రీసెంట్ గానే ఆయన సూర్య హీరోగా నటించిన "రెటృఓ" మూవీ ప్రీ  రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు . సాధారణంగా విజయ్ దేవరకొండ స్టేజ్ పైకి వస్తున్నాడు అంటే జనాలకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మాటలు ఆయన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగానే ఉంటాయి అన్న నమ్మకం అందరికీ ఉంది .


అయితే ఈసారి మాత్రం ఎవ్వరు ఊహించిన విధంగా జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించాడు విజయ్ దేవరకొండ . జమ్మూకాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి పై ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కుసింత ఘాటుగానే పాకిస్తాన్ వాళ్ళని ఏకిపారేశారు . "ఆ పాకిస్తానీ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ లేదు అని ..కాశ్మీర్ మనదే అని .. కాశ్మీర్లో ఉన్నోలు మనోళ్లే అని.. కాశ్మీర్ తో ఆయనకున్న విడదీయరాని అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు ".



అంతేకాదు పాకిస్తాన్ ప్రజలే ఆ గవర్నమెంట్ ని పడగొట్టి అటాక్ చేస్తారు అని కూసింత ఘాటుగా మాట్లాడారు . సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల తాలూకా వీడియో బాగా వైరల్ గా మారింది.  ఈ వీడియో పై కొందరు పాజిటివ్గా స్పందిస్తూ ఉంటే మరి కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు.  చాలామంది విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు నిజమే అని.. ఆయన మాట్లాడిన పద్ధతిని ఆటిట్యూడ్ అంటూ నెగిటివ్గా చూస్తున్నారు . కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు . కొంతమంది విజయ్ దేవరకొండ ది ఆటిట్యూడ్ అంటుంటే మరి కొంతమంది తలపోగురు అని మాట్లాడుకుంటున్నారు...!

మరింత సమాచారం తెలుసుకోండి: