టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పూరి దర్శకత్వం వహించిన సినిమాలు చాలా వరకు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆఖరుగా పూరి జగన్నాథ్ "డబల్ ఇస్మార్ట్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇకపోతే పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ , విజయ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ , విజయ్ తో చేయబోయే సినిమాలు కేవలం 60 రోజుల్లో పూర్తి చేయబోతున్నట్లు , ఈ సంవత్సరం చివరి వరకు ఈ మూవీ ని విడుదల చేసే విధంగా ఈ మూవీ బృందం వారు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమాలో విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ నటించబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే విజయ్ , పూరి కాంబోలో రూపొందబోయే సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ కన్ఫామ్ చేసి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు కూడా ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: