అనుకోని వ్యక్తిగత సమస్యల రీత్యా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దూరం అయిన సమంత తిరిగి టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో తన ఇమేజ్ పెంచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. టాప్ హీరోలతో మళ్ళీ భారీ సినిమాలు చేయాలని ఆమె అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆప్రయత్నాలకు టాలీవుడ్ టాప్ హీరోల నుండి సరైన స్పందన రావడంలేడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఆమె నిర్మాతగా మారి చిన్న సినిమాలను తీయాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ‘శుభం’ మూవీ. అంతా కొత్త నటీనటులతో నిర్మించిన ఈమూవీలో సమంత ఒక అతిధి పాత్రలో కనిపించబోతోంది. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ చాల తక్కువ పెట్టుబడితో తీసినట్లు తెలుస్తోంది.


ఈసినిమా ప్రమోషన్ ను అంతా తానై సమంత అంతానై చూసుకుంటోంది. ఈమూవీ టీజర్ ను చాల వెరైటీగా కట్ చేయడంతో ఈమూవీ పై కొద్దికొద్దిగా అంచనాలు పెరుగుతున్నాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ గా ఈమూవీ కథ ఉంటుంది అని అంటున్నారు. టీవి సీరియల్స్ ప ఉన్న పిచ్చితో చనిపోయిన తరువాత దెయ్యాలుగా మారిన ఇద్ధరు మహిళలు చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి.


ఈ మూవీతో పోటీగా శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా ఉన్నప్పటికీ ఆపోటీని లెక్కచేయకుండా సమంత తన చిన్న సినిమా పై ఉన్న ధైర్యంతో విడుదలకు ముందే వేసిన ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ రావడంతో సమంతసినిమా ప్రమోషన్ విషయంలో వేగాన్ని పెంచింది. సమంతకు బాలీవుడ్ లో ఉన్న పరిచయాల రీత్యా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థకు ముందుగానే అమ్మినట్లు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమా కావడంతో కేవలం మొదటి మూడు రోజులు ప్రేక్షకులు ధియేటర్లకు వస్తే సమంత నిర్మాతగా తన తొలి విజయం సాధించినట్లే అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: