రామాయణం కాన్సెప్ట్ తో ఎన్నో సినిమాలు తెరకెక్కై. మరీ ముఖ్యంగా రామాయణ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని సినిమాను తెరకెక్కించాలి అని పలువురు డైరెక్టర్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.  అయితే అందరికీ అది సాధ్యం కాదు . కొంతమంది మాత్రమే రిస్క్ చేసి మరి అలాంటి కాన్సెప్ట్ తెరకెక్కిస్తూ ఉంటారు . ప్రభాస్ తో డైరెక్టర్ ఓ రావత్.."ఆది పురుష్" అనే ఒక సినిమాని తెరకెక్కించారు . అయితే ఇది పూర్తిగా డిజాస్టర్ అయిపోయింది.  రాముడి పాత్రలో ప్రభాస్ అస్సలు సూట్ కాలేదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు . దానికి తగ్గట్టే నాసిరకమైన గ్రాఫిక్స్ సినిమాని మరింత డిజాస్టర్ గా మార్చేశాయి అంటూ అప్పట్లో హ్యూజ్ ట్రోల్లింగ్ చేశారు .ఆ తర్వాత రామాయణ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు రాబోతున్నాయ్ అంటూ ప్రచారం జరిగింది . ఫైనల్లీ ఒక డైరెక్టర్ మాత్రమే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అఫీషియల్ గా ప్రకటించారు.


మనకు తెలిసిందే రన్బీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా "రామాయణం" సినిమా రూపొందుతుంది . ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి . కాగా  రీసెంట్ గానే మొదటి భాగం సినిమా షూటింగ్ పూర్తయినట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.  అంతేకాదు ఈ సినిమా గ్లిమొస్ అండ్ టైటిల్ లోగోని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ ట్రెండ్ అవుతుంది. కాగా ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .



నిజానికి ఈ సినిమాలో ముందుగా రాముడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ ని అనుకున్నారట మూవీ మేకర్స్.  సీత పాత్ర కోసం అలియా భట్ అనుకున్నారట . ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ కాంబో సూపర్ సక్సెస్ అయింది.  అలానే మేకర్స్ ప్లాన్ చేశారట . రామ్ చరణ్ కూడా ఓకే చేశారట. కానీ లాస్ట్ మినిట్ కొందరు బాలీవుడ్ పెద్దలు మన సినిమాలో బాలీవుడ్ హీరో కాకుండా ..తెలుగు హీరో ఏంటి...?? అంటూ ఆయనను ఈ సినిమా నుంచి తప్పించేశారట. ఇలా జరుగుతుందని ఫ్యాన్స్ ముందు గానే ఊహించారు. అనుకున్నట్లే జరిగింది. ఇక ఆ తరువాత ఆలియా భత్ కూడా  కాల్ షీట్స్ బిజీగా ఉన్న కారణంగా రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత చాలామంది హీరోలు హీరోయిన్లను అనుకున్నా.  ఫైనల్లీ రాముడు పాత్రలో రణ్బీర్ కపూర్ సీత పాత్రలో సాయి పల్లవి సెలెక్ట్ అయ్యారు . మొత్తానికి వీళ్ళ కాంబో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: