
కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ "కలిసుందాం రా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట హీరో గా వెంకటేష్ ను అనుకోలేదట. మొదట ఈ మూవీ లో నాగార్జున ను హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను వెళ్లి కలిసి ఈ సినిమా కథ మొత్తాన్ని కూడా మూవీ బృందం వినిపించిందట. కథ మొత్తం విన్నాక నాగార్జున ఈ స్టోరీ నాపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో ఈ మూవీ బృందం వారు వెంకటేష్ ను కలిసి ఆ మూవీ కథను వివరించారట. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాలో నటించడానికి ఒకే చెప్పారట. ఈ మూవీ వెంకటేష్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీల లిస్టులో చేరిపోయింది. అలా నాగ్ రిజెక్ట్ చేసిన మూవీ లో వెంకటేష్ నటించి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.