నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ జంట కలసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా బాలయ్య కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా హంగామా వల్లే ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. సీజీ, వీఎఫ్ ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా మొత్తం ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా అనిపించేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ప్రత్యేకంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.


బోయపాటి ప్రత్యేకతే అయిన ఎమోషనల్ హై పాయింట్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో మరింత ఘనంగా రూపుదిద్దుకుంటున్నాయని సినిమా యూనిట్‌ చెబుతోంది. ఈ విష‌యంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని బాల‌య్య ప్ర‌త్యేకంగా గైడ్‌లెన్స్ ఇచ్చార‌ట‌. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలయ్యతో ఆమె జంట ఎలా కనెక్ట్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్ ఈ అఖండ 2కు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సూపర్ హైప్ క్రియేట్ చేసింది.


‘అఖండ 2 – తాండవం’ సినిమాను ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ఖరారు చేసింది. ఆ రోజున తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా పెద్ద ఎత్తున స్క్రీన్లు దక్కబోతున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: