
కలిసుందాం రా : వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. 2000 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో మొదట హీరోగా వెంకటేష్ ను కాకుండా నాగర్జున ను అనుకున్నరాట. అందులో భాగంగా నాగార్జునను సంప్రదించగా ఆయన మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో వెంకటేష్ ను ఈ మూవీ లో హీరో గా తీసుకున్నారట. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
బద్రి : పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ 2001 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాలో మొదట పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ ను కాకుండా నాగార్జున ను హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా నాగార్జున ను కలిసి ఆ మూవీ కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించను అని చెప్పాడట. దానితో పవన్ కి బద్రి సినిమా కథను వినిపించగా ఆ మూవీలో హీరోగా నటించడానికి పవన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయం దక్కింది.
ఇలా నాగర్జున తన కేరిర్లో కొన్ని మంచి విజయం సాధించిన సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.