ఇండియన్ సినిమా అభిమానులంతా, ముఖ్యంగా టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్లోబ్ ట్రాటర్ (SSMB29)’ నుంచి ఒక మైండ్‌-బ్లోయింగ్ విజువల్ ఫీస్ట్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఈ సినిమాపై చూపుతున్న క్రేజ్, ఎక్సైట్మెంట్ అద్భుతంగా ఉంది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇద్దరి కలయికే ఒక సెన్సేషన్‌గా నిలుస్తుండగా, ఇప్పుడు సినిమా ప్రమోషన్లు కూడా ఒక గ్లోబల్ లెవెల్ ఫినామెనాన్ అవుతున్నాయి.


రాబోయే నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ స్పెషల్ ఈవెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది సాధారణ ప్రెస్ మీట్ కాదు, ఇండియన్ సినిమా ప్రమోషన్ల చరిత్రలో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే ఒక హై-ఎండ్ గ్లోబల్ ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో “గ్లోబ్ ట్రాటర్” చిత్రానికి సంబంధించిన కీ వీడియో ఫుటేజ్, అంటే సినిమాలోని మొదటి స్నీక్ పీక్ లేదా కాంసెప్ట్ గ్లింప్స్‌ను మెగా స్క్రీన్‌పై ప్రదర్శించబోతున్నారనే వార్త ఫ్యాన్స్ మధ్య అద్భుతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ హక్కులను ‘జియోహాట్‌స్టార్’ పొందిందని సమాచారం. ఈ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఆ సంస్థ రాజమౌళి టీంకు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో దేశం మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లైవ్‌గా వీక్షించనున్నారు.



దీనికి సంబంధించి రాజమౌళి కొద్దిసేపటి క్రితమే ఓ వీడియో రిలీజ్ చేశారు. "ఈ  ఈవెంట్‌కు కేవలం పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం ఇవ్వబడుతుంది. ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తామని, జనసంద్రం ఏర్పడకుండా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు రాజమౌళి స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మాత్రమే ఎంట్రీ అనుమతిస్తారు, అంతకు ముందు ఎవరూ వెళ్లకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, 18 ఏళ్ల లోపు వారికి, వృద్ధులకు పోలీసులు ప్రవేశ అనుమతి ఇవ్వరని, కాబట్టి వారు ఈవెంట్‌కు రాకూడదని సూచించారు.



రాజమౌళి  విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  గతంలో జరిగిన పెద్ద ఈవెంట్లలో తలెత్తిన అనుభవాల నుండి చాలా నేర్చుకున్నామని, అందుకే ఈసారి అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశామని చెప్పారు. ఫ్యాన్స్‌తో పాటు మీడియా కూడా ఈ ఈవెంట్‌లో భాగమవుతుందని, అందరూ క్రమశిక్షణగా వ్యవహరించాలని కోరారు. అదనంగా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్, రూమర్స్‌ను అస్సలు నమ్మవద్దు అని స్పష్టంగా హెచ్చరించారు. “నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో మనం అందరం కలుద్దాం! ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఇండియన్ సినిమా గ్లోబల్ జర్నీకి ఆరంభ ఘట్టం” అని చెబుతూ వీడియోని ముగించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: