మగధీరను తీసుకున్నా, ఈగ అయితే, బాహుబలి అయితే, ఆర్ఆర్ఆర్ అయితే… ఏ సినిమా చూసినా ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. విలన్ పాత్రలు,ఫీమేల్ రోల్స్—అన్ని బాగుంటాయి. చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం కూడా అదే—రాజమౌళి సినిమాలో కొన్నిసార్లు హీరో కన్నా విలన్, హీరోయిన్ పాత్రలే మరింత ఇంపాక్ట్ను ఇస్తాయి అని. ఇక ఇప్పుడు అతను తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రానికి వస్తే… ఈ సినిమాలో విలన్ పాత్ర ‘కుంభ’. ఈ పాత్ర కోసం రాజమౌళి ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఆలోచన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ను ఎంపిక చేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్.
పృథ్వీరాజ్ అంటే అందంగా, వ్యక్తిత్వం గల, స్క్రీన్పై రాయల్ లుక్ ఇచ్చే హీరో. అలాంటి వ్యక్తిని విలన్ గా చూపించడం మాత్రమే కాదు… వీల్చైర్లో కూర్చోబెట్టడం అనేది చాలా రిస్కీ నిర్ణయం. అంటే అతనిలో ఉన్న మాగ్నెటిక్ పర్సనాలిటీని కంట్రోల్ చేసి, ఒక అలాంటి శారీరక పరిమితి గల పాత్రలో చూపడం—ఇది గొప్ప క్రియేటివ్ రిస్క్. కాని స్టేజ్ పైకి వచ్చినప్పుడు పృథ్వీరాజ్ చూపించిన ఆ ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్ చూసినవాళ్లంతా ఆశ్చర్యపోయారని చెబుతున్నారు.“స్క్రీన్పై ఈ విలన్ హీరోనే మించిపోతాడేమో” అనే ఫీలింగ్ చాలా మందికి కలిగిందట. అతను కుంభ పాత్ర కోసం పెట్టుకున్న డెడికేషన్ స్టేజ్ మీదే కనిపించింది.అయితే ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన టాక్ కూడా వినిపిస్తోంది. ఈ కుంభ పాత్ర కోసం మొదట రాజమౌళి గోపీచంద్ను అనుకున్నారట.విలన్గా గోపీచంద్ చేస్తే కూడా రోల్ కి భారీ ఎఫెక్ట్ వస్తుందనే అభిప్రాయం ఉండిందట. కానీ కారణాలు ఏవో తెలియదు—ఆ పాత్ర గోపీచంద్ చేతి దాకా వెళ్లి మళ్లీ మారిపోయి… చివరకు అది పృథ్వీరాజ్ సుకుమారన్కు వెళ్లిందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి