చిరంజీవి వద్దకు వెళ్లిన కథ… ఎందుకు నిలిచిపోయింది?
ఏజెంట్ శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పాయిని కాక మరెవరినీ ఊహించలేం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ కథ మొదటగా చిరంజీవి వద్దకు వెళ్లిందట. రాజ్ & డీకే ఈ కథను వెబ్ సిరీస్గా కాకుండా ఒక సినిమాగా రాశారట. ఆ కథను నిర్మాత అశ్వనీదత్కి వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందట. వెంటనే చిరంజీవిని కలిసి చెప్పగా, చిరుకి కూడా కథ నచ్చిందట. అయితే 'ఖైదీ నెంబర్ 150' విజయానంతరం ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో ప్రేక్షకులు తనను ఆమోదిస్తారా అన్న సందేహం చిరంజీవికి కలిగిందట. దాంతో ప్రాజెక్ట్పై ముందుకు వెళ్లలేమని భావించారు. రాజ్ & డీకే కథలోని పిల్లల పాత్రలను తీసివేసి మార్పులు చేయాలా అని ఆలోచించినా, చివరకు ఆ ఐడియా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ కథ అక్కడే నిలిచిపోయింది.
చిరంజీవితో కథ కుదరనందున, దీనిని పూర్తిస్థాయి వెబ్ సిరీస్గా మార్చాలని రాజ్ & డీకే నిర్ణయించారు. మనోజ్ బాజ్పాయిని సంప్రదించాలనుకున్నారు. అయితే మొదట ఫోన్ చేయగా, వెబ్ సిరీస్లలో ఓవర్ శృంగారం, హింస ఉంటుందనే అభిప్రాయంతో "ఇలాంటి ప్రాజెక్ట్లు చేయను" అని మనోజ్ తిరస్కరించారట.రాజ్ & డీకే సన్నిహితులు, “మీరు అనుకున్న విధంగా ఇది ఉండదు… ఒకసారి వచ్చి కథ వినండి” అని ఒత్తిడి చేయడంతో, చివరకు మనోజ్ స్క్రిప్ట్ విన్నారు. కథ విన్న తర్వాత ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయి, వెంటనే ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయంలోనే. శ్రీకాంత్ తివారీ పాత్ర ఆయన కెరీర్లో భారీ మలుపుగా మారి, జాతీయ స్థాయిలో మళ్లీ అతని స్థాయిని నిరూపించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్పాయిని కొత్త హైట్స్కు తీసుకెళ్లిన గేమ్ చేంజర్గా నిలిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి