మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి 2026 బరిలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ!వెంకటేష్ ఈ సినిమాలో భాగం కావడం, ఆయన పాత్ర కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే కాదని, స్టోరీ నేరేషన్‌లో కీలకమైన పాత్ర అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే, అది థియేటర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ పండగ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.


ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్, హెలికాప్టర్ షూట్ జరగనుందని వార్తలు వచ్చాయి. దీనిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో క్లారిటీ ఇచ్చారు. "అది యాక్షన్ సీక్వెన్స్ కాదు... ఫన్ ఫైట్! హెలికాప్టర్లు ఉన్నాయి నిజమే. కానీ అది మెగా బ్లాస్టింగ్ ఫైట్ కాదు. ఆ సన్నివేశాలను థియేటర్‌లో చూసి ఆడియన్స్ ఫన్ ఎంజాయ్ చేయాలి" అని అనిల్ స్పష్టం చేశారు. ఆయన మాటల ప్రకారం, ఈ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్‌కు అంతులేని వినోదాన్ని అందిస్తుందని అర్థమవుతోంది.ఇదే కాకుండా, అనిల్ రావిపూడి ఒక హాట్ హైలైట్ కూడా షేర్ చేశారు. ఈ సినిమాలో ఇంకా నాలుగు పాటలు ఉన్నాయని, వాటిలో ఒక స్పెషల్ సాంగ్ చిరంజీవి-నాగార్జున కాంబినేషన్‌లో ఉండబోతుందని ప్రకటించారు. ఈ మెగా-కింగ్ కాంబినేషన్ తెలుగు సినీ అభిమానులకు మరో పెద్ద సర్ ప్రైజ్‌గా మారింది.


"చిరంజీవి గారు ఈ తరహా న్యూ ఏజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రలో దాదాపు 25 ఏళ్లుగా కనిపించలేదు. ఇది కొత్త తరం పిల్లలకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది" అని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ విధంగా, స్టార్ హీరోలు, ఫ్యామిలీ ఎమోషన్, పక్కా కామెడీ, మరియు సరదా ఫైట్‌తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి 2026లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: