ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్క్రిప్ట్ దశ నుంచే ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను అత్యంత గ్రాండ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడట. అందుకే కథ, పాత్రలు, సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన టీమ్తో కలిసి స్క్రిప్ట్పై మళ్లీ వర్క్ చేస్తున్నారని సమాచారం.భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఖర్చులు నియంత్రణలో ఉండేలా అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాస్టింగ్ విషయంలోనూ పునరాలోచన జరుగుతున్నట్టు టాక్.
ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్గా నయనతార ఫిక్స్ అయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే… ఈ సినిమా కోసం నయనతార ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే సినిమా బడ్జెట్ భారీగా ఉండటంతో, హీరోయిన్ పారితోషికం వల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారట.నయనతార స్థానంలో మరో హీరోయిన్ను తీసుకుంటే దాదాపు రూ.6 కోట్ల వరకు బడ్జెట్ సేవ్ అవుతుందని నిర్మాతలు లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నయన్ ప్లేస్ ని రీప్లేస్ చేసే సత్త ఒక్క త్రిష కే ఉంది అంటూ మేకర్స్ ఆమెని ఫైనలైజ్ చేశారట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇక బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈ సినిమాను మరో మాస్ బ్లాక్బస్టర్గా మార్చాలనే ఆశతో ఉన్నారు. పీరియాడికల్ కథ, ద్విపాత్రాభినయం, గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ట్రీట్మెంట్… ఇవన్నీ కలిస్తే ‘ఎన్.బి.కె 111’ టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.మరి చివరికి హీరోయిన్ ఎవరు? బడ్జెట్ ఎంత వరకు ఖరారవుతుంది? స్క్రిప్ట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్న విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి