ఫొటోల్లోనే కనబడిపోతోంది వాళ్ళ సంతోషం ఏమిటో.  40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును ఘోరంగా ఓడించిన తర్వాత తమను కలిసిన ఏపి కాబోయే సిఎం వైఎస్ జగన్మోన్ రెడ్డి గట్టిగా హత్తుకున్నారు. చంద్రబాబునాయుడుపై ఇటు నరేంద్రమోడి, అటు కెసియార్ కున్న కసి ఏంటో వాళ్ళు జగన్ ను హత్తుకోవటంలోనే స్పష్టంగా అర్ధమైపోతోంది.

 

ముందుగా హైదరాబాద్ లోని కెసియార్ ఇంటికి జగన్ వెళ్ళారు. జగన్ ను రిసీవ్ చేసుకునేందుకు కెసియార్ ఇంటి నుండి బయటకు వచ్చి ఆవరణలో కారు ఆగే దగ్గర నిలబడ్డారు. జగన్ కారులో నుండి బయటకు రాగానే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చమిచ్చి తర్వాత శాలువాను కప్పి గట్టిగా హత్తుకున్నారు.

 

తర్వాత నరేంద్రమోడిని కలవటానికి జగన్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళారు.  తనను కలసిన జగన్ ను మోడి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. హత్తుకోవటం కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ఆనందంతో కావలించుకున్నారు. మోడి కళ్ళల్లో ఆనందం కళ్ళల్లో కనబడుతోంది.

 

ఇంతకీ ఇద్దరు కూడా జగన్ కు అంత సాధర స్వాగతం పలకటం, గట్టిగా హత్తుకోవాల్సిన అవసరం ఏమిటి ? ఏమిటంటే వాళ్ళిద్దరికీ చంద్రబాబు మీదున్న కోపం, కసి అనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రతీ సభలోను అవసరం ఉన్నా లేకపోయినా పై ఇద్దరినీ చంద్రబాబు ఎంతగా శాపనార్ధాలు పెట్టిందీ అందరూ చూసిందే.

 

పై ఇద్దరిని రాజకీయంగా కాకుండా వ్యక్తిగత శత్రువులుగా చూశారు చంద్రబాబు. రాష్ట్రంలో తన ప్రత్యర్ధి జగన్ తో ముడిపెట్టి  ప్రతీ సభలోను పై ఇద్దరినీ అమ్మ నా బూతులు తిట్టారు. దాంతో వాళ్ళు కూడా చంద్రబాబు అంటే మండిపోయారు. ఫలితాల్లో చంద్రబాబుకు ఊహించని ఘోర పరాభావం ఎదురైంది. దాంతో జగన్ సంగతేమో కానీ వాళ్ళిద్దరు మాత్రం ఫుల్లు ఖుషీ అయిపోయినట్లున్నారు.  ఆ ఆనందమే పై ఫొటోల్లో కనబడుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: