తాజాగా కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలో ఉన్న హై కోర్టులు ఇచ్చిన తీర్పులు సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీశాయి అని చెప్పాలి. ఈ తీర్పు ప్రభుత్వ కార్యాలయాల్లో విధులను నిర్వర్తించే వారికి అనుకూలంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ విషయం అసలు కోర్ట్ వరకు ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిత్రదుర్గకు చెందిన ఒక వ్యక్తి నుండి ఆ ఏరియాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రూ. 5000 లంచాన్ని ఇమ్మని డిమాండ్ చేశారట, అయితే దీనికి కోపం తెచ్చుకున్నా సదరు వ్యక్తి వెంటనే అవినీతి నిరోధక శాఖకు చెందిన అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.

వెంటనే ఫైర్యాధు స్వీకరించిన ఏసీబీ ఆ కార్యాలయంపై దాడులు జరుపగా, అధికారి టేబుల్ మీద రూ. 5000 కట్ట ఉండడాన్ని గమనించారు. కానీ ఆ కట్టాను ఆ ఉద్యోగి స్వీకరించలేదట, అయితే బాధితుడు మాత్రం వారిపై శిక్ష తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆ విషయం కాస్త కోర్ట్ వరకు చేరింది. హై కోర్ట్ ఈ కేసును బాగా పరిశీలించి ఇచ్చిన తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటగా మారిందని చెప్పాలి. తీర్పులో ఉన్న ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ప్రజలను లంచం అడగడం ఏమంత తప్పు కాదని, కానీ ప్రజలు లంచాన్ని ఇచ్చి అధికారి పుచ్చుకుంటే మాత్రం తప్పుగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని కోర్ట్ స్పష్టం చేసింది.

వాస్తవానికి నూటికి తొంబై తొమ్మిది మంది లంచాన్ని డిమాండ్ చేయడంతో పాటు కచ్చితంగా తీసుకునే తీరుతారు. తీసుకునే ఉద్దేశ్యం లేనప్పుడు అసలు అడిగి ఉపయోగం లేదన్నది చాలా మంది అభిప్రాయం. మరి ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఊరట కానున్నది అన్నది తెలియాల్సి ఉంది. అస్సలు... లంచం అడగడం, ఇవ్వడం మరియు తీసుకోవడం అన్నీ కూడా తప్పు కిందకే వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: