కామా తురానాం.. నభయం న లజ్జ.. అన్న సామెత తెలిసిందే. ఈ మద్య కామంతో రెచ్చిపోతున్న కొంత మంది బంధాలు అనుబంధాలు మర్చిపోతూ నీచానికి పాల్పపడుతున్నారు.  తాజాగా ఓ తల్లి తన కామ వాంఛ తీర్చుకోవడం కోసం తన కన్న కూతురునే బలి తీసుకుంది.   హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుడితో  మహిళకు అక్రమ సంబంధం కొనసాగించేది. ఆ అక్రమసంబంధాన్ని కొనసాగించాలనే దుష్ట పన్నాగం పన్ని తన కూతురినే ఫణంగా పెట్టి ఆమె మరణానికి కారణం అయ్యింది. వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మీర్ పేట, అల్మాస్ గూడలో నివాసం ఉండే వేలూరి అనితకు బాబూరావు అనే వ్యక్తితో 20ఏళ్ల క్రితం పెళ్లైంది.  ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు.. గత కొంత కాలంగా బాబు రావుతో అనితకు విభేదాలు రావడంతో వేరుగా ఉంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటుంది. 

 

ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్‌ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తన అక్రమ సంబంధాన్ని కొనసాగించే క్రమంలో ఓ దుష్టపన్నాగం పన్నింది వేలూరి అనిత.  తన పెద్ద కూతురుని నవీన్ కి ఇచ్చి పెళ్లి చేస్తే అతనే తన ఇంటికి వస్తాడనని.. అప్పుడు ఇద్దరం హాయిగా అక్రమ సంబంధాన్ని కొనసాగించవొచ్చని పక్కా ప్లాన్ ప్రకారం డిగ్రీ చేస్తున్న వందన(19)ను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది. వివాహమైన తరువాత కూడా అనిత, నవీన్ కుమార్‌ల వివాహేతర సంబంధం కొనసాగేది.

 

ఇది గమనించిన వందన విడిగా ఉందామని భర్తకు చెప్పగా ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానంటూ అనిత బెదిరించింది. తనను ఇంటిని నుంచి వెళ్లిపొమ్మంటే ఇంట్లోనే ఉరిపోసుకకొని చనిపోతానని బెదిరించింది అనిత.  తన తల్లి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో   తన చావుకు తన తల్లే కారణం... నా భర్తతో అక్రమ సంబంధం ఉండటం వల్లే తాను తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.  చిన్న కూతురు.. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: