ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ ను  కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  క్రీడారంగం తో పాటు... సినీ రంగం పూర్తిగా ఎక్కడికక్కడ షెడ్ డౌన్  అయిపోయింది. ఎప్పుడు మ్యాచ్ లతో  బిజీగా ఉండడం లేదా  మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ  తీరిక లేకుండా ఉండే క్రికెట్ స్టార్స్ అందరూ ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో బాగా సమయం దొరకడం తో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. అటు సినీ సెలబ్రిటీలు కూడా లాక్ డౌన్  సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  అమలవుతున్న నేపథ్యంలో.. ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. 

 

 

 అయితే ఇంత కాలం వరకూ తీరిక లేకుండా ఉన్న సెలబ్రిటీలకు ఒక్కసారిగా చాలా తీరిక  దొరకడంతో... ఎక్కువ సమయం ఏం చేయాలో అర్థం కాక సరికొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తమకు తెలియని ఎన్నడూ చేయని పనులను కూడా చేస్తున్నారు చాలా మంది సెలబ్రెటీలు. కొత్త పనులను నేర్చుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తమకు నేర్చుకుంటున్న కొత్త పని గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. కత్రినా కైఫ్ కూడా లాక్ డౌన్  సమయంలో రెస్ట్ తీసుకో కుండా బాగా కష్ట పడుతున్నారు.. 

 

 

 మొన్నటికి మొన్న వంటగదిలో గిన్నెలు కడిగి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది కత్రినాకైఫ్. ఇక ఇప్పుడు చీపురు పట్టింది. తన గదిని  కత్రినా స్వయంగా ఉడ్చేసింది. అయితే కత్రినా తన గదంతా చీపురు  పడుతూ ఉడుస్తుంటే  తన  సోదరీ ఇసాబెల్లె కైఫ్ దీన్ని  వీడియో తీసింది. ఇక ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో... అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. లాక్ డౌన్ లో  భాగంగా నా  పని నేను చేసుకుంటున్నా... అంటూ కత్రినాకైఫ్ కామెంట్ పెట్టింది . ఈ క్రమంలోనే కొద్ది సేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతున్నట్లుగా  చీపుర్లతో అటూ ఇటూ ఆడించింది కత్రినాకైఫ్. ఈ సందర్భంగా ఇంట్లో ఉండండి ప్రాణాలను రక్షించుకోండి అంటూ అందరికీ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: