ఈ మధ్య కాలంలో ప్రపంచంలో వింతలు విడ్డూరాలు ఎక్కువై పోయాయి. కరోనా వైరస్ మొదలు కొని వింత వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇప్పుడు ఈ వార్త వింటే తప్పకుండా  అవాక్కవుతారు మరి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?? ఒక హత్య కేసులో కోడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ వ్యక్తి మరణానికి కారణమైంది అంటూ ఆ కోడి పై ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు ఆ కోడిని అదుపులోకి తీసుకున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా... చిత్రం విచిత్రం అయినప్పటికీ ఇది  నిజంగా నిజమే. జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి మరణానికి పందెం కోడి కారణమని పోలీసులు నిర్ధారించారు.

దాంతో ఆ కోడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు అధికారులు. ఇటీవల గొల్ల పల్లి మండలంలో కోడి పందాలు నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. అయితే వెల్లటూరు మండలం.. కొండా పూర్ స్థానికుడు అయినటువంటి సతీష్ పందెం కోడి కాలికి కత్తి కట్టే సమయంలో... ఆ కోడి తప్పించుకునేందుకు శత విధాలా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఆ కోడి కాలికి ఉన్న కత్తి కాస్త సతీష్ మర్మాంగానికి గుచ్చు కోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది దాంతో సతీష్ కుప్ప కూలి పోయాడు. అది గమనించిన స్థానికులు హుటా హుటిన అతనిని జగిత్యాల ఏరియా హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు విడిచాడు సతీష్.

అయితే ఈ మృతిపై ఫిర్యాదు రావడంతో... విచారణకు దిగిన పోలీసులు విషయం తెలుసుకున్నారు. సతీష్ మరణానికి పందెం కోడే మూల కారణమని తెలుసుకొని... దానిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిజానికి సతీష్ హత్యకు పందెం కోడి కారణమని తేల్చిన పోలీసులు దానిని అరెస్టు చేయడం గురించి అందరు విచిత్రంగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ కోడిని ఏం చేస్తారంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: