కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు కొన్ని రోజుల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ప్రజల మెప్పును పొందడానికి హామీలను ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఈ ప్రచారానికి ఈ రోజుతో గడువు ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ లో మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా పలు చోట్ల ఏకగ్రీవ కావడంతో ఆయా ప్రదేశాలలో ఎన్నికలు జరగడం లేదు.
అంతే కాకుండా పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల మరియు మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. అయితే మిగిలిన ఈ కొన్ని గంటల ప్రచారాలు ఓటర్లను రాజకీయ పార్టీలు ఎంత మాత్రం ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ ఎన్నికలపై వైసీపీ మాత్రం ధీమాగా ఉంది. పంచాయతీ ఎన్నికలలో జరగిన విధంగానే, పురపాలక ఎన్నికలలో కూడా ప్రజలు మాపై నమ్మకముంచి గెలిపిస్తారని వైసీపీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నగర పలక తీర్పు ఎవరికి అనుకూలంగా రానుంది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి