ఈ విషమ పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలది మాత్రమే భాధ్యత అని చెప్పలేం. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంది. ఉన్నవారు లేని వారికి ఖచ్చితంగా సాయం చేయాల్సిన గడ్డు కాలం ఇది. ప్రతి ఒక్కరూ మానవత్వం తో స్పందించాల్సిన సమయం ఇది. మీ సాయం ఒకరికి ప్రాణం పోసినా అది నిజంగా గర్వించదగ్గ విషయమే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరణించిన వారి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. వైరస్ భయంతో కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా వారి అంతిమ సంస్కారాలు జరపడంలేదు. ఉన్నవారు లేనివారికి సాయం చేస్తే కనీసం కొద్ది మంది ప్రాణాలైనా కాపాడవచ్చు. చివరగా ఒక్క మాట...కరోనాతో మరణించిన వారికి కనీసం వారి బంధువుల చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. అలాంటప్పుడు...
"చనిపోయాక...ఎక్కడ నీ బలగం...ఎక్కడ నీ చుట్టాలు...ఎక్కడ నీ బంధువులు మిత్రులు...ఎక్కడ నీ డబ్బు, నగలు ఆస్తులు...ఎక్కడ నీ కులపిచ్చి...ఎక్కడ నీ పరువు మర్యాదలు... నిన్ను మోసుకెళ్లడానికి నలుగురు నీ వాళ్ళు లేనప్పుడు..ఇకనైనా నీ అహాన్ని వీడు...ఇలాంటి మరణాలు చూసైనా మారండి... లేని వాడికి పట్టెడన్నం పెట్టండి"
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి