ప్రధాన నరేంద్ర మోడీ శుక్రవారం రోజు భారతీయ శాస్త్రవేత్తలను పొగడ్తలతో ముంచెత్తారు. కరోనా మహమ్మారికి విరుగుడుగా భారతదేశంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి చేసినందుకుగాను ఆయన ఇండియన్ సైంటిస్ట్ లపై ప్రశంసల వర్షం కురిపించారు. సంవత్సర కాలంలోనే కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు ఇతర మార్గాలను కనిపెట్టడం పై కూడా ఆయన హర్షం వ్యక్తం చేశారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సొసైటీ తో శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. గడచిన శతాబ్దం లో విదేశాల్లో అభివృద్ధి చేసిన ఆవిష్కరణలు పొందడానికి భారతీయులు ఎన్నో సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేదని.. కానీ ప్రస్తుతం భారతీయ శాస్త్రవేత్తలే విదేశీ శాస్త్రవేత్తలతో సరిసమానంగా కృషి చేస్తూ అద్భుతమైన ఆవిష్కరణలను సొంతంగా తయారు చేస్తున్నారని ఆయన అన్నారు.



"వ్యవసాయం నుంచి ఖగోళ శాస్త్రం వరకు.. విపత్తు నిర్వహణ నుంచి రక్షణ సాంకేతికత వరకు.. ఒక టీకా నుంచి వర్చువల్ రియాలిటీ వరకు.. భారతదేశం ప్రతి దిశలో సొంతంగా అధికారం పొందాలని కోరుకుంటుంది. సుస్థిర అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ రంగాలలో భారతదేశం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది, ”అని ప్రధాని అన్నారు.

భారతదేశంలో ఎన్నడూ అభివృద్ధి చేయని టీకా సంవత్సర కాలంలోనే భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేశారని పొగిడిన ప్రధాని.. సామాన్యులు అందరూ తమపై తాము ఆధారపడేలా చాలా శక్తివంతంగా మారాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం తగ్గినప్పటికీ మన సంకల్పం స్థిరంగానే ఉందని ఆయన అన్నారు. ఇతర దేశాలు సాఫ్ట్‌వేర్, శాటిలైట్ డెవలప్‌మెంట్ రంగాల్లో అభివృద్ధి సాధించడం లో ఇండియా కీలకమైన పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.



ఇకపోతే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారతీయ శాస్త్రవేత్తలు సరికొత్త పరిష్కారాలను కనిపెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంతంగా సమర్థవంతమైన టీకాలు అభివృద్ధి చేయడంలో భారత్ సక్సెస్ కావడం నిజంగా గర్వించదగ్గ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: