ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొత్త పీఆర్సీకి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. అయితే... ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం హెచ్ఆర్ఏ తగ్గించటంతో పాటు సీసీఏ రద్దు వంటి నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలా పెల్లుబీకింది. ప్రభుత్వ జీవోలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎస్తో సహా ఏపీ ఆర్థిక - జీఏడీ అధికారులు కూడా ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ అంశంపైన ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేబినెట్లో తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తర్వాతే... తమ ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొత్త పీఆర్సీకి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. అయితే... ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం హెచ్ఆర్ఏ తగ్గించటంతో పాటు సీసీఏ రద్దు వంటి నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలా పెల్లుబీకింది. ప్రభుత్వ జీవోలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎస్తో సహా ఏపీ ఆర్థిక - జీఏడీ అధికారులు కూడా ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ అంశంపైన ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేబినెట్లో తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తర్వాతే... తమ ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారింది.