ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా పావులు కదుపుతున్నారు. హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరు తీసేయటం అనేది అసలు విషయమే కాదు. ఎన్టీయార్ పేరు తీసేయటం ద్వారా బాగా గొడవలు జరుగుతాయని జగన్ కు బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా పేరు ఎందకు మార్చారు ? ఎందుకంట గొడవ జరిగిన తర్వాత మొదలయ్యేదే అసలైన రాజకీయం కాబట్టే.






ఇపుడు జరుగుతున్నదంతా జగన్ అనుకున్నట్లే జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ కు జరిగిన అవమానం, నష్టమంతా చంద్రబాబు+ఎన్టీయార్ వారసుల వల్లే జరిగిందనే విషయం జనాల్లో బాగా చర్చకు రావాలన్నది ప్లాన్. చంద్రబాబు, ఎన్టీయార్ వారుసులే ఎన్టీయార్ ను నడివీధిలో నెలబెట్టి చెప్పులతో కొట్టించారనే విషయం జనాల్లో బాగా నాటుకుపోవాలన్నది అసలు వ్యూహం. చివరకు  ఎన్టీయార్ స్ధాపించిన టీడీపీకి చంద్రబాబు, ఎన్టీయార్ వారసులకు అసలు సంబంధమే లేదని నిరూపించటమే జగన్ ఉద్దేశ్యం.





తన ప్లాన్ లో జగన్ నూరుశాతం సక్సెస్ అయినట్లే ఉన్నారు. ఎన్టీయార్ టీడీపీ ఎన్టీయార్ తోనే పోయిందని ఇపుడున్నది కేవలం చంద్రబాబు టీడీపీ మాత్రమే అని జనాల్లో బలంగా నాటుకుని పోయేందుకు జగన్ గట్టిగా ప్రయత్నించారు. జగన్ ప్రయత్నం కారణంగానే వారసులతో కలిసి చంద్రబాబు ఫైనల్ గా ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటం, పార్టీని లాగేసుకోవటం, చావుకు కారణమవ్వటం అనే విషయాలపై  విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.





యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేయటమనే ఎరను వేసిన జగన్ చివరకు చంద్రబాబు, బాలకృష్ణతో పాటు ఎన్టీయార్ వారసులందరినీ రోడ్డుమీదకు లాగేశారు. చంద్రబాబుతో చేతులు కలిపి ఎన్టీయార్ కు వారసులంతా ద్రోహం చేశారని జనాల ముందు నిలబెట్టడమే జగన్ టార్గెట్. జగన్ పన్నిన ఉచ్చులో నుండి బయటపడలేక చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతలంతా గిలగిల్లాడుతున్నారు. అందరు కలిసే ఎన్టీయార్ కు ద్రోహం చేసిన విషయం ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి తాము చేసిన పనిని ఇపుడు కాదనలేక, అంగీకరించలేక నానా అవస్తలు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: