మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్ గఢ్, తెలంగాణ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రెండు మూడు నెలల్లో జరగనున్నాయి. అయితే ఒక టీడీపీ నేత మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించరని మార్చి వరకు పొడిగించి మినీ జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం  ఉందన్నారు. అయితే సాధారణంగా అది సాధ్యం కాకపోవచ్చు. పదవీ కాలం పూర్తయే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి.  పోనీ అప్పటి దాకా ఆగుదామంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి. దీనికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు.


దీన్ని కావాలనే సోషల్ మీడియాలో చోటా మోటా పత్రికలో రాసుకొచ్చారు. ఇది చేయాలంటే అంతా ఈజీ కాదు. ఇది అమలు చేయడం చాలా కష్టమని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్,రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ఆధిక్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ బాగా పుంజుకుంటోంది. భారతీయ జనతా పార్టీలో విబేధాలు ఉండటం, సుధీర్ఘ కాలంగా అక్కడ బీజేపీ పాలన ఉండటం కూడా ప్రజలకు వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది.


వసుంధర రాజే సింధియా వల్ల రాజస్థాన్ లో బీజేపీ దెబ్బతింటుందని ఆమెకు పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు పక్కన పెట్టేశారు. డైరెక్టుగా బీజేపీ కేంద్రనాయకత్వం చూసుకుంటోంది. ఛత్తీస్ గఢ్ లో కూడా ఈ సారి బీజేపీ అధిష్టానమే అన్ని తామై చూసుకుంటోంది. లోకల్ లీడర్లను నమ్ముకుంటే లాభం లేదని భావిస్తోంది. ఓడినా, గెలిచినా మోదీదే బాధ్యత అనే విధంగా చేస్తున్నారు.


ఇటు తెలంగాణలోనూ 119 నియోజకవర్గాలకు వివిధ రాష్ట్రాల నుంచి బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పంపించారు. వీరు ఆయా నియోజకవర్గ బాధ్యతలు నిర్వర్తించాలి. వారే మొత్తం ఆ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి బలాలు, బలహీనతలు ఏంటి అని చూసుకోని బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కేంద్రం పెద్ద ప్లానే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: