తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా... సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చాలా సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో తిరగకుండా... హైదరాబాదులోనే ఉంటున్నారని మండిపడ్డారని ఈ సమాచారం అందుతోంది. హైదరాబాదులో తిరగకుండా సొంత నియోజకవర్గానికి.. వెళ్లి కాంగ్రెస్ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు.

 అయినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాదులోనే ఉంటూ.. పథకాలపై ప్రచారం చేయడం లేదని మండిపడ్డారట రేవంత్ రెడ్డి. ఇకపై హైదరాబాదులో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకూడదని... నిత్యం జనాల్లో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అలా కాదని హైదరాబాదులోనే ఉన్న ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారట సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయిందని.... ఇలాంటి నేపథ్యంలో పథకాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

 కాబట్టి జనాలు.. ఆగ్రహానికి గురికాకముందే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగాలని సూచించినట్లు సమాచారం.  అదే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు సభ పైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఎస్ అయ్యారు. అసలు కేసీఆర్ ప్రసంగంలో... వస్తలేదంటూ చురకలాంటించారు.  తన నోటికి వచ్చింది మాట్లాడి కెసిఆర్ వెళ్లిపోయాడని ఫైర్ అయ్యారు.

 ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరు కూడా... తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి.. ప్రజలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుందని వెల్లడించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: