
ఇంతలోనే రాష్ట్రంలో ఎదురవుతున్న పలు సమస్యలపై నేతలు పూర్తిగా మౌనం వహించడం జగన్ను మరింత ఆగ్రహానికి గురి చేసింది. రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తుంటే, తమ నియోజకవర్గాల్లో ఉండే వైసీపీ నేతలు ఒకరైనా వారితో భుజం కలపలేదని తీవ్రంగా మండిపడ్డారు. అంతే కాదు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి ముఖ్య సమస్యలపై కూడా మౌనం వహించడం వల్ల ప్రజల్లో పార్టీ మీద నెగటివ్ ఫీలింగ్ పెరుగుతోందని జగన్ గట్టిగా చాటిచెప్పారని తెలిసింది. “పార్టీ కష్టాల్లో ఉండగా ఇంటిల్లో కూర్చున్న నేతలకు ఇక టిక్కెట్లు ఉండవు. మీకోసం కార్యకర్తలు చెమటోడ్చుతుంటే మీరు తలుపులు మూసుకుని కూర్చోవడం మాకు అంగీకారమేమీ కాదు. మీ వారసులకు కూడా మినహాయింపు ఉండదు” అంటూ జగన్ తేల్చి చెప్పారట. దీంతో సీనియర్ నేతలతో పాటు కొంతమంది యువ నేతలు కూడా షాక్ అయ్యారని సమాచారం.
ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో సీనియర్ నేతల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో పెద్ద చర్చ మొదలైంది. వాళ్లు తమ వారసులను పోటీలోకి తీసుకురావాలని ప్రయత్నించినా జగన్ సూటిగా తిరస్కరించారట. అంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి కేవలం ప్రజలతో కదిలే, ఎప్పటికప్పుడు ఫీల్డ్లో ఉండే నేతలకే అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు.ఇకనైనా పార్టీ నేతలు బయటకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనకపోతే, రాబోయే రోజుల్లో జగన్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఖాయం. “ఒక టర్మ్ అధికారానికి దూరమైనా పరవాలేదు, కానీ పార్టీకి దూరంగా ఉండే నేతలను స్పేర్ చేయను” అని జగన్ చెప్పిన మాటే ఇప్పుడు వైసీపీ అంతటా హాట్ టాపిక్గా మారింది.