మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను తమకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ గా భావిస్తోంది. కంటోన్మెంట్ విజయం ఇచ్చిన జోష్లో, మరో సిట్టింగ్ సీటును లాక్కోవాలని సకల అస్త్ర శస్త్రాలతో సిద్ధమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ వ్యక్తిగత ఛరిష్మా, గతంలో ఓటమి పాలైనా నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పట్టు ప్లస్గా మారాయి. వీటికి తోడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికపై గట్టి ఫోకస్ పెట్టడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మజ్లిస్ మద్దతు 'హస్తం'కు వరం! .. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపును శాసించేది మైనార్టీ ఓటు బ్యాంకు అనడంలో సందేహం లేదు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్న మజ్లిస్ (MIM) పార్టీ ఈసారి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం హస్తం పార్టీకి వరంగా మారింది. మజ్లిస్ మద్దతుతో ముస్లిం ఓట్ల సెంట్రలైజేషన్ కాంగ్రెస్కు భారీగా కలిసి రానుంది. ఇది బీఆర్ఎస్కు గట్టి మైనస్గా పరిణమించే అవకాశం ఉంది.
బీజేపీ వైఫల్యం! .. ఈ మహా సంగ్రామంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన బీజేపీ ఏమాత్రం సీరియస్గా కనిపించడం లేదు. అభ్యర్థిని సైతం చాలా ఆలస్యంగా ఖరారు చేయడం, ఎన్నికను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీ నిరాసక్తతను సూచిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన లంకల దీపక్ రెడ్డికి సీటు ఇచ్చినా, ఆయన కూడా అంత ఆసక్తితో ఉన్నట్టు కనిపించడం లేదు. మైనార్టీ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి పూర్తిగా దూరం కావడం ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తోంది. మొత్తం మీద చూస్తే, జూబ్లీహిల్స్ పోరు.. బీఆర్ఎస్ పట్టుకోసం చేసే పోరాటం, కాంగ్రెస్ దూకుడు మధ్యే అన్నది సుస్పష్టం. హోరాహోరీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలంటే నవంబర్ 14న వచ్చే ఫలితాల కోసం వేచి చూడక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి