కాంగ్రెస్ విమర్శల ప్రకారం, గత ఏడాది వింటర్ సెషన్ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు – 26 రోజులు కొనసాగగా, ఈసారి కేవలం 19 రోజులు మాత్రమే పెట్టడం ప్రభుత్వ తీరును చూపుతోందని అన్నారు. బిల్లులు ఆమోదం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పార్లమెంట్ను వాడుకుంటోందని, ప్రజా సమస్యలపై చర్చకు మాత్రం దూరంగా ఉంటోందని ఆరోపించారు.ఇక అధికార ఎన్డీయే మాత్రం “తక్కువ రోజులు అయినా ఫలప్రదంగా జరగాలని” లక్ష్యంగా పెట్టుకుంది. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరపాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు కేంద్ర నేతలు చెబుతున్నారు. అయితే, ప్రతిపక్షం మాత్రం దీనిని ‘రాజకీయ నాటకం’గా చూస్తోంది.
గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు సాగాయి. కానీ, ప్రతిపక్ష నిరసనలు, బిహార్ ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై గొడవలతో సభలు సరిగా నడవలేదు. ఉత్పాదకతలో కూడా తీవ్ర పతనం చోటుచేసుకుంది — లోక్సభలో 31 శాతం, రాజ్యసభలో 39 శాతం మాత్రమే! ఇప్పుడు చలికాల సెషన్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తి. కాంగ్రెస్ విమర్శలు, ఎన్డీయే సమాధానాలు — ఈ సారి “శీతాకాలం” కంటే వేడి ఎక్కువగా ఉండబోతోందని రాజకీయ వర్గాల అంచనా. దేశ రాజకీయ దిశను నిర్ణయించే కీలక చర్చలు జరగబోతున్నాయనే భావనతో అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి