తమ కూటమి ఈసారి విజయానికి ఖచ్చితంగా చేరుకుంటుందని భావించిన కాంగ్రెస్–ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్బంధన్కు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే దూకుడుకు సమీపంలోకైనా రాలేకపోవడం ప్రతిపక్ష శిబిరానికి పెద్ద షాక్గా మారింది. కౌంటింగ్ ట్రెండ్స్ స్పష్టత చెందుతున్న కొద్దీ ఈ నిరాశ ఆగ్రహంగా మారింది.ఈ నేపథ్యంలో కౌంటింగ్ హాల్స్ దగ్గర, పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. "ఓటర్ల తీర్పును వక్రీకరించారు", "ఓట్లను దొంగిలించారు" అన్న ఆరోపణలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు వారు ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. సుమారు 65 లక్షల ఓట్లను, అందులో ఎక్కువ భాగం ప్రతిపక్షానికి అనుకూలమైన ఓట్లేనని, వాటిని ఎస్ఐఆర్ పేరుతో తొలగించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఎండీయే కి పడిన ఓట్లు దొంగ ఓట్లు అని..అవి చెల్లవు అని..ఇంత భారీ స్థాయిలో ఓట్లు జాబితా నుండి తొలగించబడిన తర్వాత, కౌంటింగ్ రోజున ప్రభంజనం ఆశించడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. "మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే, ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యం అవుతుంది?" అని ఠాగూర్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. ప్రతిపక్షం ఈ ఆరోపణలను మరింతగా ప్రచారం చేస్తోంది. మరోవైపు, ఎన్డీయే నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఆధారరహితమైనవిగా కొట్టిపారేస్తున్నారు. అంతా కలిసి బీహార్ రాజకీయాల్లో మరోసారి విశేష ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఓట్ల లెక్కింపు పూర్తి అవుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి