అతి జాగ్రత్తగా కిటికీలు, తలుపులు కట్ చేస్తూ లోపల చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసి అంబులెన్స్లలో సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మదురై, తిరునెల్వేలి వంటి పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రమాదానికి కారణంగా అతివేగం, దృష్టిభ్రమ లేదా రోడ్డు పరిస్థితుల లోపాలేనా అన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు .. రెండు బస్సుల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మృతుల వివరాలను గుర్తించేందుకు సంబంధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు ..
ఈ ఘటన స్థానికులను తీవ్రగా కలచివేసింది. రోడ్లపై అతివేగంపై పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ రవాణా వాహనాలపై మరింత పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు అంటూ అక్కడి అధికారులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనికి సబంధించి పూర్తి వివరాలను బయటపెట్టబోతున్నారట.. .!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి