తిరుమల తిరుపతి పవిత్రను కాపాడడం కోసం ttd కట్టుబడి ఉన్నది. గత వైసిపి పాలనలో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైందనే విమర్శలు కూడా ఎక్కువగా వినిపించడంతో ఈసారి అలాంటివేవీ జరగకుండా తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ పలు నిర్ణయాలను తీసుకుంటోంది. అందుకే ఎన్నో అంశాల పైన చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వ విన్నపాలను కూడా పక్కకు పెట్టేస్తోంది టీటీడీ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో 2 ఎకరాల భూమిని కేటాయించాలనే విన్నపాన్ని టీటీడీ తిరస్కరించినట్లు తెలుస్తోంది.


అసలు విషయంలోకి వెళ్తే.. పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు సంబంధించి తిరుమలలో కొత్త గెస్ట్ హౌస్లను నిర్మించడానికి భూమిని కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ టిటిడి ని కోరారు. అయితే వారి అభ్యర్థులను తీసుకున్నప్పటికీ టీటీడీ పాలకమండలి వాటిని తిరస్కరించింది. తిరుమల కొండ పైన కొత్త నిర్మాణాలపై నిషేధం విధించడమే కాకుండా, భూమి కొరత ఉండటం వల్ల హైకోర్టు ఆంక్షలు అమలులో ఉండడం వల్ల భూమి కేటాయింపు అంగీకరించమంటూ , అందుకు బదులుగా ఇప్పటికే ఉన్న అతిథి గృహాలను ఈ శాఖలకు కొన్ని అనువైన భవనాలను కేటాయిస్తామంటూ  తెలియజేశారు.


మంత్రి అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖను డిసెంబర్ 16వ తేదీన జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో చర్చించారు. తిరుమల కొండ పైన భూమి లభ్యత చాలా తక్కువగా ఉందని అందుకే కొన్నేళ్లుగా తిరుమల కొండమీద నిషేధం ఉందని, హైకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించారు అంటూ తెలిపారు. శిధిల వ్యవస్థకు చేరిన గెస్ట్ హౌస్లు కాలేజీలను మాత్రమే పునర్నిర్మించడానికి టీటీడీ అనుమతులు ఇస్తోంది. ఈ కారణం వల్లే అటు డిప్యూటీ సీఎం, మంత్రి అభ్యర్థనను తిరస్కరించాల్సి వచ్చిందని టీటీడీ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: