ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా జీవితం, తాత్విక బోధనలు, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం మరియు నలుగు ప్రత్యేక తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ, సత్యసాయి బాబా చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మానవతా మార్గం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, భక్తులు—ప్రతీ ఒక్కరూ సత్యసాయి బాబాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “మానవ సేవే మాధవ సేవ’’ అన్న సత్యసా
పుట్టపర్తి సందర్శన అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరుతున్నారు. అక్కడ దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం–2025ను ప్రారంభించనున్నారు. ఈ వేదికపై దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,000 కోట్లకు పైగా నిధులను పీఎం-కిసాన్ 21వ విడత కింద విడుదల చేయనున్నారు. తరువాత ఈ సమావేశంలో కూడా ప్రధాని ప్రసంగించనున్నారు. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి