ఆశిష్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అదిరిపోయే ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సిస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. మరోవైపు సహచరులందరూ వెను తిరుగుతున్నా పట్టుదలతో పోరాడి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మీత్ ఇంగ్లిష్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్.. మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


ఇప్ప‌టికే ఓ టెస్ట్ సీరిస్‌లో ఎక్కువ ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా అరుదైన రికార్డుకు చేరువ‌లో ఉన్న స్మీత్  వరుసగా పదోసారి ఇంగ్లండ్‌పై 50కి పైగా పరుగులు సాధించాడు. ఓ దేశంపై వరుసగా ఇన్ని అర్ధ సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు పాక్ ఆటగాడు ఇంజమాముల్ హక్ పేరుపై ఉండేది.


2001-2006 మధ్య హక్ ఇంగ్లండ్‌పై వరుసగా 9 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును స్మిత్ బద్దలుగొట్టాడు. కాగా, స్మిత్ సెంచరీ ముంగిట అవుటయ్యాడు. 145 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 80 పరుగులు చేసిన స్మిత్.. వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల‌లో అర్ధ‌సెంచరీలు అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సీరిస్‌లో కూడా ఇప్ప‌టికే ఎక్కువ ప‌రుగులు చేసిన స్మిత్ త‌న ప‌రుగుల ప్ర‌వాహాన్ని ఆప‌డం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: