ఈ క్రమంలోనే ఇక టి20 సిరీస్ లోని ఐదు మ్యాచ్ లను కూడా ఐదు వేరు వేరు వేదికలలో నిర్వహించాలని బిసిసీఐ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరుగగా ఇక ఈ నెల 12వ తేదీన రెండో టి-20 మ్యాచ్ ఒడిషాలోని కటక్ వేదిక జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి అని చెప్పాలి. అయితే రెండవ టీ20 మ్యాచ్ కోసం ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అన్ని అమ్ముడు పోయాయి. ఆన్లైన్లో టికెట్లు దొరకని వారు ఆఫ్ లైన్ వేదికగా సొంతం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే టిక్కెట్ విక్రయ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూకట్టారు అనే చెప్పాలి.
ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఏకంగా సినిమా టికెట్ల మాదిరిగా అమ్మాయిల మధ్య గొడవ జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతుంది. మహిళలందరూ క్యూ లైన్ లో ఉండగా లైన్ పాటించకుండా క్యూ లో ఒక మహిళ వచ్చి చేరింది. ఆమెను వెనక్కి పంపించేందుకు ఇతర మహిళలందరూ కూడా ఆమెను వెనక్కి లాగుతూ ఉన్నారు. ఇలా క్రికెట్ మ్యాచ్ కోసం మహిళలు పోటీ పడటం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి..