మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి ఈ ప్రపంచకప్ టోర్నికి భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ ను విడుదల చేయడం.. ఇక ఆ షెడ్యూల్ కు అనుగుణంగానే అన్ని టీమ్స్ కూడా తమ మ్యాచ్లు ఎప్పుడూ ఉన్నాయి అని తెలుసుకోవడం జరిగిపోయింది. అయితే ఇక వరల్డ్ కప్ లో టైటిల్ గెలవడమె లక్ష్యంగా ప్రతి టీం  కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో ప్రపంచ కప్ గెలవాలని నిర్ణయించుకున్నాయి అన్ని టీమ్స్. ఇక ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు.. తమ జట్టు వివరాలను కూడా ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేని నేపథ్యంలో.. ఇక అన్ని టీమ్స్ కూడా సిద్ధమైపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని షాకులు తగులుతున్నాయి. ఏకంగా జట్టులో ఉన్న ఆటగాళ్ళు వరుసగా గాయాల బారిన పడుతూ ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా టీం కి కూడా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఇలాంటి ఒక భారీ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది



 ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న అన్రిచ్ నోర్జేతో పాటు సిసింద మగల గాయల బారిన పడ్డారట. ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరల్డ్ కప్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇక వారి స్థానంలో అడింలే, లిజాద్ విలియమ్సన్ ను జట్టులోకి తీసుకున్నట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి 15 మంది సభ్యులతో కూడిన రివైజ్డ్ జట్టును ప్రకటించింది. కాగా సౌత్ ఆఫ్రికా జట్టుకి టెంప బావుమా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc