వన్ డే ప్రపంచ కప్ దగ్గరపడింది. అన్ని దేశాలు తమ తమ టీం లను అనౌన్స్ చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ కూడా ప్రపంచ కప్ టీం ను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేసింది. పాకిస్తాన్ క్రికెట్ టీం చీఫ్ సెలెక్టర్ మరియు మాజీ ప్లేయర్ ఇంజమామ్ ఉల్ హాక్ ఈ ప్రెస్ మీట్ లో ఒక రెపోర్ట్రర్ అడిగా ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. పాకిస్తాన్ మొహమ్మద్ నవాజ్, మరియు షాదాబ్ ఖాన్ లను స్పిన్నర్లుగా ఎంపిక చేసినట్టు అనౌన్స్ చేసారు ఇంజమామ్ ఉల్ హాక్. దీనికి ఒక రిపోర్టర్ స్పందిస్తూ  నవాజ్ మరియు షాదాబ్ ఖాన్ లను ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పోల్చి, ఆ పాకిస్తాన్ బౌలర్లను తక్కువ చేసి మాట్లాడారు. అందుకు స్పందిస్తూ ఇంజమామ్ ఉల్ హాక్ " మీరు మన బౌలర్లు ఇద్దరి గురించి మంచి గణాంకాలతో ముందుకు వచ్చారు. కానీ నేను కుల్దీప్ యాదవ్ ని పాకిస్తాన్ టీంకు సెలెక్ట్ చెయ్యలేను. ఎందుకంటె అతను వేరే జట్టుకి చెందినవాడు." అని చమత్కారంగా సమాధానమిచ్చారు.

గత రెండు సంవత్సరాలుగా మొహమ్మద్ నవాజ్, మరియు షాదాబ్ ఖాన్ పాకిస్తాన్ టీం తరుపున చాలా బాగా పెర్ఫర్మ్ చేసారని, అందుకే వారిని ప్రపంచ కప్ కు సెలెక్ట్ చేశామని చెప్పారు ఇంజమామ్ ఉల్ హాక్. ప్రపంచ కప్ టీం ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేసి తయారు చేయబడిందని, ఇప్పుడు సడన్ గా అందులో మార్పులు చెయ్యడం సాధ్యం కాదని ఆయన అన్నారు. మధ్య ఓవర్లలో వారు వికెట్లు తియ్యలేకపోతున్నప్పటికీ, వారి స్థాయి ప్రదర్శన వారు చేస్తున్నారని, వారిద్దరి పై తమకు నమ్మకం ఉందని అన్నారు ఇంజమామ్. ఇకపోతే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నజీమ్ షా ప్రపంచ కప్ కు దూరమైనట్టు తెలుస్తోంది. ఆసియ కప్ లో గాయానికి గురైన నజీమ్ ఇంకా కోలుకోకపోవడంతో, హాసన్ అలీ ని టీం లోకి తీసుకున్నట్టు తెలిపారు ఇంజమామ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pam