ఒకవైపు రాజకీయాల్లో కూడా ఎంపీగా గెలిచి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడుగా కూడా ఉన్నాడు గంభీర్. అయితే గంభీర్ ఎప్పుడు ఎంతో దూకుడుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి దూకుడే ఇక అతనికి ఎన్నో వివాదాలుకు కారణమైంది. ఇలా క్రికెట్ తో ఎలా అయితే అతను హాట్ టాపిక్ గా మారిపోయాడో.. వివాదాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచేవాడు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్లతో గొడవ పడటం అంటే అతనికి మహా ఇష్టం. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ తన కెరియర్ లో ఎంతోమంది పాక్ క్రికెటర్లతో గొడవపడ్డాడు.
ఇలాంటి గొడవలలో అటు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహీద్ ఆఫ్రిదితో గంభీర్ పడిన గొడవ మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. 2009లో కాన్పూర్ లో జరిగిన ఒక వన్డే మ్యాచ్ సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా.. ఇక ఈ గొడవకు సంబంధించిన వీడియోనే ఎక్కువగా తెరమీదకి వస్తూ ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ వీడియోనే ఎందుకు చూపిస్తారు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ ఘటనను తాను వదిలేసానని.. మీడియో కూడా ఆ విషయాన్ని వదిలేసి.. పాకిస్తాన్ పై ఇండియా సాధించిన విజయాలను చూపించాలి అంటూ గౌతమ్ గంభీర్ సూచించాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి