ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ముంబై వాంఖడే స్టేడియం ఒక సెమీఫైనల్ మ్యాచ్కి వేదిక కానుంది. మరోవైపు, పాకిస్తాన్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారతదేశం – పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. రెండో సెమీఫైనల్ మాత్రం ముంబైలో. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి చేరితే — ఆ ఫైనల్ కూడా కొలంబోలోనే ఆడిస్తారు. భారత్లో అహ్మదాబాద్తో పాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా వేదికలు ఎంపికయ్యాయి. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె, డంబుల్లా వేదికలుగా నిర్ణయించారు. అధికారిక షెడ్యూల్ను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది. అయితే ఈ లిస్టులో అహ్మదాబాద్ పేరు వినగానే ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఎందుకు మళ్లీ అదే వేదిక? ఆ పిచ్ మీద మన ఆటగాళ్లకు ఏమాత్రం సపోర్ట్ ఉండదన్న విషయం వరల్డ్ కప్లోనే తెలిసింది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజున పిచ్ ప్రవర్తన పూర్తిగా అనూహ్యంగా ఉండటం వల్లే టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ తడబడిపోయారని అప్పట్లో చర్చ నడిచింది. ఇప్పుడూ అదే స్టేడియంలో మరో ప్రపంచ ఫైనల్ జరగబోతుండటంతో అభిమానులు ఆందోళన చెందడం సహజమే. “ఓడిన చోటే గెలిచి రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన బాగానే ఉంది, కానీ పిచ్ సైన్స్కి కూడా విలువ ఇవ్వాలి” అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి - 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం మళ్లీ అహ్మదాబాద్ని ఫిక్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓటమి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్న నేపథ్యంలో, భారత క్రికెట్ అభిమానుల మనసులో ఒకే ప్రశ్న — “మళ్లీ అదే వేదికనా?”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి