జాను అసలు పేరు రసజ్ఞా రెడ్డి.. రసజ్ఞా ను రీతు అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఈమె బుల్లితెరపై అడుగులు వేసి తన అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే మంచి ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. నవంబర్ 10వ తేదీన జన్మించిన ఈమె చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది.. ఈ నేపథ్యంలో ని తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడల్ గా రసజ్ఞా రెడ్డి తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లతోపాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. మహానటి, రౌడీ బేబీ, ఇద్దరి మధ్య లో ఏం జరిగింది, మై డాడీ ఇస్ మై హీరో.. నాటకం, నిజం తెలుసుకోవాలంటే, కథనం ,బావమరదళ్ళు లాంటి పలు షార్ట్ ఫిలిమ్స్ లో రసజ్ఞ నటించింది.
ఆడదే ఆధారం సీరియల్ తో ఈమె బుల్లితెరపై అడుగుపెట్టి, ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన మజిలీ సీరియల్ లో నటించింది. రసజ్ఞా ఒక నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. ప్రస్తుతం ఈటీవీలో నా పేరు మీనాక్షి అనే సీరియల్లో జాను పాత్రలో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.