తెలంగాణలోని ఓ జిల్లాను భూకంపాలు వణికిస్తున్నాయి. సాధారణంగా తెలంగాణకు భూకంపాల భయం ఉండదంటారు కానీ.. ఇటీవల ఆ జిల్లాలో వరుసగా భూమి కంపిస్తోంది. పది రోజుల్లో పదిసార్లు భూమి కంపించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా పరిధిలోని కృష్ణా నది పరీవాహక గ్రామాల్లో పది రోజులుగా స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి.

 

ప్రధానంగా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల పరిధిలోని పదికిపైగా గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. చింతలపాలెం మండల కేంద్రంతో పాటు, దొండపాడు, రామాపురం గ్రామాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనిపై ఆందోళన చెందుతున్న గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు చెప్పారు. వీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

 

వీరు సంబంధిత శాస్త్రవేత్తలతో మాట్లాడి.. ప్రకంపనలు నిజమేనని తేల్చారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని పులి చింతల, గోవిందాపురం గ్రామాలు కేంద్రంగా చేసుకుని స్వల్ప ప్రకంపనలు వస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈనెల 2 నుంచి 11 తేదీ మధ్యలో సుమారుగా పది సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు. వీటి తీవ్రత భూకంప లేఖినిపై 3.2, అంతకంటే తక్కువగా నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: