ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం విద్యాసంస్థలు మూతపడడంతో వల్ల  ఎవరైనా సంతోషంగా ఫీలయ్యారో లేదో కానీ అటు ఎంసెట్ ర్యాంకులు టెన్త్ ఫలితాలు విడుదల అయినప్పుడు... ఒకటి ఒకటి ఒకటి.. రెండు రెండు రెండు.. అన్ని ర్యాంకులు మావే.. అంటూ  టీవీలో చెప్పే ప్రకటనలు రాకపోవడంతో మాత్రం చాలా మంది సంతోష పడుతున్నారు అని చెప్పాలి.  ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే చాలు నారాయణ, శ్రీచైతన్య అంటూ పెద్ద పెద్ద కాలేజీలు ఇక తమ విద్యార్థులు సాధించిన ర్యాంకులను పెద్దవాయిస్ తో చెప్పేవారు.



 అయితే కొంతమంది జనాలకు ఇది కాస్త ఇరిటేటింగ్ గా అనిపించినప్పటికీ.. ఇక ఆయా కాలేజీలకు మాత్రం ఇలా చెప్పడమే ఎక్కువగా కలిసి వచ్చేది అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఆయా కాలేజీలు సాధించిన ర్యాంకులను గంభీరమైన వాయిస్ తో జనాలకు చేరేలా చెప్పడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు తమ తమ విద్యార్థులకు ఆయా కళాశాలల్లో చేర్పించాలని భావించేవారు. అయితే ఇక ఇలా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ర్యాంకుల గురించి చెప్పే వాయిస్ వింటే ఒక్కసారిగా నిద్రలోంచి ఉలికిపడే విధంగా ఉంటుంది. ఎంతో గంభీరంగా.. ఎంతో బేస్ తో ఉంటుంది ఆ వాయిస్. ఇలా ర్యాంకుల వాయిస్ ఓవర్  ఇచ్చేది ఎవరు అనే విషయం చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియదు.



 ఆయన ఎవరో కాదు చైతన్య కృష్ణ... ఏ కాలేజీ కి సంబంధించిన ర్యాంకింగ్ యాడ్ అయిన సరే  ఆయన వాయిస్ తోనే పూర్తిగా దద్దరిల్లి పోయే విధంగా చెప్పేవారు. ఇక ఇటీవలే చైతన్య కృష్ణ కు సంబంధించిన ఒక వాయిస్ ఓవర్ వీడియో వైరల్ గా మారిపోయింది. ఒక షూటింగ్ లో భాగంగా కొంతమంది ఇక ఇలా ర్యాంకులకు సంబంధించిన వాయిస్ ఓవర్ చెప్పాలి అంటూ కోరారు.  ఈ క్రమంలోనే పదవ తరగతి రాంకింగ్ చెబుతున్నట్లుగా చైతన్య కృష్ణ చెప్పారు. అయితే  ఇప్పటివరకు కేవలం టీవీలో ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ వాయిస్ విన్నవారు. ఇక ఇప్పుడు లైవ్లో ఒక వ్యక్తి ఈ వాయిస్ చెబుతూ ఉండటం  చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: