అమెజాన్ లో ఆపిల్ ఐఫోన్ 12 ని ఆర్డర్ చేసి డెలివరీ అందుకున్నప్పుడు కస్టమర్ పెద్ద షాక్‌కు గురయ్యాడు.ఎందుకంటే ఆ ప్యాకేజీలో వచ్చినది డిష్ వాషింగ్ సబ్బు ఇంకా అలాగే రూ .5 కాయిన్. కేరళలోని కొచ్చి నగర శివారు అలువా నివాసి అయిన నూరుల్ అమీన్ తన ఐఫోన్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్నాడు, దానికి అతను పదివేల రూపాయలు వెచ్చించాడు, కానీ దానికి బదులుగా అతనికి లభించింది డిష్ వాష్ సబ్బు ఇంకా రూ. 5 నాణెం. ఈ కథను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే, అది వైరల్ అయింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు ఇంకా రూ .5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది.రూ. 70,900 పెట్టి అమెజాన్‌లో నూరుల్ తన ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అతని ప్యాకేజీని అందుకున్నప్పుడు అందులో ఇక ఫోన్ కి బదులుగా సబ్బు బార్‌ రావటంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇక భారీ మొత్తాన్ని వాపసు పొందడం జరిగింది. నూరుల్ తన అమెజాన్ పే కార్డ్ ద్వారా అక్టోబర్ 12 న ఆర్డర్ ఇచ్చారని ఇంకా ఆ ప్యాకేజీని అక్టోబర్ 15 న అందుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతను దాని యొక్క అన్‌బాక్సింగ్ వీడియోను కూడా చేసాడు కానీ లోపల ఏముందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.నూరుల్ ఫిర్యాదు చేసిన వెంటనే, సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.ఇక ఒక నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2021 నుండి జార్ఖండ్‌లో ఎవరో నూరుల్ ఆర్డర్ చేసిన ఫోన్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ఈ కేసు గురించి మాట్లాడుతూ, మేము అమెజాన్ అధికారులను అలాగే తెలంగాణాకు చెందిన విక్రేతను సంప్రదించాము. ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉంది, అయితే అక్టోబర్‌లో మాత్రమే ఆర్డర్ ఇవ్వబడింది.ఇక మేము విక్రేతను సంప్రదించాము, ఫోన్ స్టాక్ అయిపోయిందని ఇంకా నూరుల్ చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: