క్రికెట్ మ్యాచ్ జరుగుతోందంటే చాలు ప్రతి ఒక ఆటగాడి లో ఊహించని రేంజిలో ఉత్కంఠ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ లో ఏ చిన్న పొరపాటు చేయకుండా ఇక విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రతి ఒక ఆటగాడు ప్రతి క్షణం కూడా అటు ఎంత అలర్ట్ గా ఉంటాడు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా టెన్షన్ లో చేయకూడని పనులు చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో పృద్వి షా వికెట్లకు త్రో విసర బోయి  రోహిత్ శర్మను బంతితో కొట్టిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుస ఓటముల తర్వాత మొదటి విజయాన్ని సాధించి అటు కోల్కతా జట్టు సత్తా చాటింది అనే చెప్పాలి. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో విజయఢంకా మోగించి ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే అత్యంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్  వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కోల్కత నైట్ రైడర్స్ బ్యాటర్ ఇంద్రజిత్ మిడ్ ఆన్ దిశగా ఆడాడు.


 ఈ క్రమంలోనే ఇంద్రజిత్ ఫించ్ సింగిల్ కోసం ప్రయత్నించారు. అయితే అక్కడే ఫీలింగ్ చేస్తూ ఉన్నాడు రాజస్థాన్ బౌలర్  ప్రసిద్ కృష్ణ. వెంటనే బంతిని అందుకుని వికెట్ల వైపు  త్రో చేశాడు. ఇక్కడే అసలు ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ప్రసీద్  కృష్ణ త్రో చేసిన బంతి నేరుగా వికెట్ల వైపు వెళ్లడమే కాదు బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు తగిలింది. దీంతో ట్రెంట్ బౌల్ట్ ఒక్కసారిగా బాలన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. ఇక అదృష్టవశాత్తు ఆ బంతి ట్రెంట్ బౌల్ట్ కాలికి తగలడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ప్రసిద్ కృష్ణ చేసిన పనికి అటు సహచర ఆటగాళ్లు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: