ఇక ఈ ఏడాది దేశ వ్యాప్తంగా కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడి ఇంకా అలాగే వేసవి తాపానికి ప్రజలు ఎంతగానో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇంకా అలాగే రాజస్థాన్‌లకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో అయితే గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరువలో ఉంది. మరి ఈ ఎండ వేడికి మనిషి మాత్రమేనా లేక గుడ్డు కూడా ఎలా ఉంటాయో తెలుసా అంటూ ఓ వ్యక్తి ప్రయోగంని చేశాడు. ప్రస్తుతం ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో ఒక వ్యక్తి ఢిల్లీలోని మండే వేడిలో టెర్రస్ మీద ఆమ్లెట్ తయారు చేస్తున్నట్లు కనిపిస్తాడు.ఎవరైనా కానీ ఆమ్లెట్‌ను స్టౌ మీద తయారు చేయడం అనేది చాలా సర్వసాధారణంగా చూసే విషయమే. అయితే ఆమ్లెట్ ని అసలు గ్యాస్‌తో కాకుండా సూర్యకాంతితో తయారు చేస్తున్నారు. సూర్యుడు బాగా భగభగమంటున్నడు. 



ఆ వ్యక్తి టెర్రస్‌పై పాన్‌తో నిల్చున్నట్లు మనం ఆ వీడియోలో చూడవచ్చు. బాణలిలో కొంచెం నూనెను పోసి అందులో గుడ్డు పగలగొట్టి వేశాడు. వాస్తవానికి వేడి కారణంగా.. ఆ పాన్ అనేది చాలా వేడిగా మారింది. ఆ తరువాత పాన్ పై వేసిన గుడ్డు ఆమ్లెట్ వేగడం ప్రారంమైంది. ఇలా ఆమ్లెట్‌ని తయారు చేశాడు.ఇక ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో cadel_tales అనే IDలో షేర్ చేయబడింది. ఇప్పటి దాకా మొత్తం 10.8 మిలియన్లు అంటే 1 కోటి 8 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను కూడా చాలా ఇష్టపడ్డారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ ని కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పైన తెలిపిన ఇంస్టాగ్రామ్ పేజీని ఓపెన్ చూసి ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: