సాధారణంగా ఎవరైనా సరే కుటుంబ సభ్యులలో ఒకరు మంచి హోదాలో ఉన్నారు అంటే ఇక ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా గొప్ప హోదాను కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తన తాతయ్య మాజీ సీఎం అయినప్పటికీ కూడా తాను ఒక సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ తనకు ఈ జీవితమే సంతోషంగా ఉంది అని చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగ చేస్తున్నాడు. అసలు విషయంలోకి వెళితే రాజకీయం అంటే ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. ప్రజాసేవ చేయడానికి లక్షలు జీతం ఇస్తున్నప్పటికీ కూడా అది సరిపోక కోట్లు దోచుకు తినే రాజకీయ నాయకులు మనకు తారసపడుతూనే ఉంటారు. చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు కూడా కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా రాజకీయాలలోకి వచ్చి కోట్ల సంపాదనతో మునిగి తేలుతున్నారు.. ఇక సాదాసీదా రాజకీయ నాయకుడే కోట్లు వెనకేసుకుంటుంటే సీఎం హోదాలో ఉన్నవారు మరి ఇంకెంత డబ్బు వెనకేసుకోవాలి దోచుకునే స్వభావం లేకపోయినా ఏదో ఒక వ్యాపారం చేసి తమ తర్వాత తరాలకు ఆస్తులను పోగేయాలి కదా కానీ ఇక్కడ రాజకీయం అంటే ప్రజాసేవ అని నమ్మారు కాబట్టే కొంతమంది హంగు, ఆర్భాటాలకు పోకుండా చాలా సాదాసీదాగా జీవిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే ఉమ్మడి ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఏపీ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఇక ఈయన మనవడు ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఆయన పేరు శ్రీధర్ గాంధీ. ఇకపోతే అప్పటి నాయకులు ఇంత నిజాయితీగా ఉండేవారు అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం అని చెప్పాలి. ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యంగా పనిచేయకుండా ఆప్తులను పోగేసుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మహానుభావులలో దామోదరం సంజీవయ్య కూడా  ఒకరు. ఈ నేపథ్యంలోనే ఆయన మనవడు శ్రీధర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎల్ అండ్ టి కంపెనీలో తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని వెల్లడించారు. ఇకపోతే సీనియార్టీని బట్టి సూపర్వైజర్ క్యాడర్ వస్తుందని కాంట్రాక్టు ఉద్యోగం అని.. నిజాయితీగా ఒక పూట తిన్న చాలు.. ఈ ఉద్యోగం పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపారు. మొత్తానికైతే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న కుటుంబం నుంచి అలాంటి వ్యక్తులే వస్తారని దానికి నిదర్శనం ఇదే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: